కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల సొమ్ము మేఘా కృష్ణారెడ్డి పాలైందని నిత్యం విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు దోచుకున్న మేఘా సంస్థ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Projet) ప్రాజెక్టులోనే ప్రభుత్వ సహకారంతో మేఘా కృష్ణారెడ్డి వేల కోట్ల ప్రజాసొమ్మును దోచుకున్నారన్న ఆరోపణలు బలపడేలా అనేక వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL)(Megha engineering and infrastructures) దాదాపు రూ.50 వేల కోట్ల అవినీతి సొమ్మును తన జేబులో వేసుకుందని ఇప్పటికే అనేక సార్లు స్పష్టమవగా.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Kaleshwaram Project: రూ.50 వేల కోట్లను కొట్టేసిన మేఘా.. ఆ రూ.500 కోట్ల ఖర్చును ఎలా తప్పించుకుంది?
2019 వరదల సమయంలో మేఘా సంస్థ కట్టిన బ్యారేజీలు దెబ్బతిన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రహస్యంగా మరమ్మతు వ్యయాన్ని భరించడం అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ అంచనా విలువ రూ. 500 కోట్లు. ప్రాజెక్ట్ నిర్మాణంలో రూ.50 వేల కోట్లు కొట్టేసిన మెఘా.. ఈ ఖర్చును తప్పించుకుంది.
Translate this News: