Telangana crime : కుల, మతాలకు అతీతంగా కలిసివుండాల్సిన జ్ఞానవంతులవుతున్న ఈ తరం యువకులే అజ్ఞానులుగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో విచక్షణ మరిచి మతం పేరిట, కులం పేరిట దాడులకు పాల్పడుతున్నారు. తమ వర్గాన్ని కించపరిచారనో లేదా మతం గురించి అసభ్యంగా మాట్లాడరనే కారణాలతో చట్టానికి విరుద్ధంగా నడచుకుంటూ సమాజంలో అల్లర్లు సృష్టి్స్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో అగ్రకుల దరుహంకారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఊర్లలో తమదే పై చేయి ఉండాలనే తపనతో కొంతమంది దారుణాలకు పాల్పడుతుండగా.. ఎస్సీ వర్గానికి చెందిన ఓ యువకుడు తనతో కలిసి చదువుకున్న స్నేహితులతో అరెయ్ అన్నాడనే కోపంతో కొట్టి చంపిన సంఘటన తెలంగాణలోని మంచిర్యాలలో జరిగింది.
పూర్తిగా చదవండి..Telangana Crime: కోడిగుడ్ల షాపు దగ్గర దారుణం.. ‘అరేయ్’ అన్నాడని యువకున్ని కొట్టి చంపిన ఫ్రెండ్స్
తక్కువ కులానికి చెందిన సంపత్ తమను అరెయ్ అన్నాడనే కోపంతో అగ్రకులానికి చెందిన ముగ్గురు యువకులు కొట్టి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సతీష్, మహేష్, అరుణ్లపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
Translate this News: