APEDA : అనారోగ్యంతో బాధపడేవారికి, పూజలకు ప్రధాన ఆహారంగా ఉపయోగించే అరటిపండు ఇప్పుడు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. కేవలం అరటిపండ్లు అమ్మడం ద్వారా రూ.8300 కోట్లు ఆర్జించాలని భారత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ విజయవంతమైన పైలట్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసింది. సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు అరటిని ఎగుమతి చేస్తున్నారు. కొంత సమయం ఎక్కువ తీసుకున్నప్పటిఈ ఎగుమతి చేస్తున్న అరిటిపండ్ల(Banana Export) నాణ్యత మెరుగ్గా ఉందని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Banana Export : అరటి పండే అని తీసిపారేయకండి.. ఎగుమతుల మార్కెట్లో దాని విలువే వేరు!
అరటి పండ్ల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచ అరటి ఉత్పత్తిలో 26.45 శాతం వాటా మనదే. కానీ, కేవలం ఒక్క శాతం ఎగుమతులు మాత్రమే అవుతున్నాయి. ప్రభుత్వం సముద్రమార్గం ద్వారా అరటి పండ్లను ఎగుమతి చేయడం కోసం కొత్త ప్రోటోకాల్ తీసుకువచ్చింది.
Translate this News: