సంజయ్ సింగ్(Sanjay singh) నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పారదర్శకత, ఇతర సమస్యల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన WFI చీఫ్ సంజయ్ సింగ్ U-15, U-20 నేషనల్స్ గోండాలో జరుగుతాయని ప్రకటించిన వెంటనే మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంది. మరోవైపు రెజ్లర్లు సంజయ్ సింగ్ WFI చీఫ్ కావడం పట్ల ఇప్పటికే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో క్రీడా మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయం వారిలో కాస్త ఆనందాన్ని ఇచ్చినట్టు అయ్యింది. ఇక జరుగుతున్న పరిణామాలపై WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. నిజానికి బ్రిజ్ భూషణ్కు సంజయ్ సింగ్ చాలా క్లోజ్. బ్రిజ్భూషణ్పై లైంగిక దాడి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అతను బీజేపీ ఎంపీ కూడా. అతనికి శిక్ష పడాలని ఏడాది కాలంగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..WFI Suspension: ‘కుస్తీ’ ఆటలో కొత్త ట్విస్ట్.. ‘నాకేం సంబంధం లేదు..’ అసలేం జరుగుతోంది?
కొత్తగా ఎన్నికైన WFI బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్కు సంబంధించిన రిపోర్టును చూడలేదని WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తెలిపారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వంతో చర్చిస్తారో, కోర్టును ఆశ్రయిస్తారో WFI సభ్యుల నిర్ణయమని స్పష్టం చేశారు.
Translate this News: