Naaz Center – Guntur : స్టార్ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas Fans) కు బిగ్ షాక్ ఇచ్చారు థియేటర్ యాజమాన్యం. ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే పూర్తి యాక్షన్ మూవీగా రూపొందించిన సినిమాపై పలు చోట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న పిల్లలతో సినిమా చూడాలంటే ఇబ్బందిగా ఉందని, కొన్ని సన్నివేశాలు భయబ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయంటూ పలువురు పేరెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గుంటూర్ లోని ఓ థియేటర్ ప్రేక్షకులను కొత్త రూల్ పెట్టింది.
పూర్తిగా చదవండి..ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ వయసువారికి థియేటర్ లోకి నో ఎంట్రీ
ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. గుంటూరు నాజ్ సెంటర్ లోని పీవీఆర్ థియేటర్ 18 ఏళ్లు దాటిన వారిని మాత్రమే హాల్ లోకి అనుమతిస్తుంది. దీంతో ముందే బుక్ చేసుకున్న ప్రేక్షకులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని థియేటర్ సిబ్బందిని నిలదీశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Translate this News: