JD Lakshmi Narayana: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జాతీయ జెండా రంగులతో లక్ష్మీనారాయణ ఫొటోతో కూడిన పార్టీ జెండాను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తమ పార్టీ పెట్టిన పార్టీ కాదని, ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, మెడలు వంచి తాము దాన్ని సాధిస్తామని స్పష్టంచేశారు. ఎవ్వరికీ తలవంచబోమని, ఎక్కడా సాగిలపడబోమని అన్నారు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకూ పరిష్కారమన్న అంబేద్కర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.
పూర్తిగా చదవండి..JD Lakshmi Narayana: ఏపీలో మరో కొత్త పార్టీ.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీని ఆయన ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ జెండా కూడా ఆవిష్కరించారు.
Translate this News: