టీమ్ఇండియా పేస్ కెరటం మహ్మద్ షమీ(Mohammed Shami)ని దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు వరించింది. బీసీసీఐ షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో పెను సంచలనాలు నమోదు చేసిన షమీ తన అద్భుత బౌలింగ్తో అందరినీ కట్టిపయగా.. షమీకి అర్జున అవార్డును ఫిక్స్ చేస్తూ కేంద్ర ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు పలువురు క్రికెటర్లకు ఈ అవార్డు దక్కింది. 2021లో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధవన్ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (2013), రోహిత్ శర్మ (2015), రవిచంద్రన్ అశ్విన్ (2014), రవీంద్ర జడేజా (2019) కూడా గతంలో అర్జున అవార్డు గెలుచుకున్నారు.
పూర్తిగా చదవండి..Shami: టీమిండియా పేసర్ షమీకి అర్జున అవార్డు.. ప్రకటించిన కేంద్రం!
వరల్డ్కప్లో ఎన్నో రికార్డులు సృష్టించిన టీమిండియా స్టార్ షమీకి కేంద్ర గుర్తింపు దక్కింది. అతనికి అర్జున అవార్డు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. హార్దిక్ గాయంతో WCకు దూరమవడంతో గ్రౌండ్ లో దిగిన షమీ మొత్తం ఏడు మ్యాచ్ల్లో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి 24 వికెట్లు పడగొట్టాడు.
Translate this News: