ముంబై ఇండియన్స్(Mumbai Indians) తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై ఇప్పటికీ సెగ చల్లారలేదు. ఐపీఎల్(IPL) ఆక్షన్తో సమానంగా ఈ కెప్టెన్సీ మార్పుపై ఇప్పటికీ తీవ్రంగా చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ(Rohit Sharma) ఇంక రిటైర్మెంట్ ప్రకటించకుండానే అతని స్థానంలో హార్దిక్ పాండ్యా(Hardik Pandya)కు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్మీడియాలో నిరసన వ్యక్తం చేస్తూ ముంబై ఇండియన్స్ సోషల్మీడియా హ్యాండిల్స్ను అన్ఫాలో చేస్తున్నారు. కొందరు ముంబై ఫ్రాంచైజీపై ఆగ్రహంలో MI జెర్సీలను తగలబెట్టారు కూడా. గుజరాత్ నుంచి ట్రేడ్ చేసుకొని తెచ్చుకున్న పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. తాజాగా దీనిపై ముంబై ఇండియన్స్ క్రికెట్ గ్లోబల్ హెడ్, మహేల జయవర్ధనే స్పందించారు.
పూర్తిగా చదవండి..Mumbai Indians: రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతాడా? తేల్చేసిన ముంబై హెడ్ కోచ్!
MI కెప్టెన్సీ మార్పుపై ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించారు. అభిమానుల ఆగ్రహం న్యాయమైనదేనని.. కానీ ఇది ఏదో ఒక సమయంలో తీసుకోవలసిన నిర్ణయమేనని వివరించారు. నాయకత్వంలో మార్పు వచ్చినప్పటికీ రోహిత్ శర్మ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని జయవర్ధనే స్పష్టం చేశారు.
Translate this News: