ఈ యేడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 7ను వివాదాలు చుట్టుముట్టాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానుల మధ్య అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాలపై దాడులు చేసి హంగామా సృష్టించడంతో పల్లవి ప్రశాంత్ తో పాటు పలువురిపై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోపై అడ్వకేట్ అరుణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పూర్తిగా చదవండి..నాగార్జున అరెస్ట్ తప్పదా..? బిగ్ బాస్ పై హైకోర్టు లో పిటిషన్
బిగ్ బాస్ షోపేరుతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అడ్వకేట్ అరుణ్ కుమార్. 100 రోజులపాటు కంటెస్టెంట్లను అక్రమంగా నిర్బంధించిన నాగార్జునపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
Translate this News: