వచ్చే(2024) ఐపీఎల్(IPL) సీజన్ కోసం కెప్టెన్గా రోహిత్ శర్మ(Rohit Sharma) స్థానంలో హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ పట్ల హిట్మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంలో రగిలిపోతున్నారు. కెప్టెన్సీ మార్పు స్మూత్గా జరగలేదని.. ఇది రోహిత్ను అవమానించడమేనని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గుజరాత్ నుంచి ట్రేడ్ చేసి తెచ్చుకున్న పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నది ఫ్యాన్స్ వాదన. ముంబైని ఐదుసార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ని తక్కువ చేశారని కామెంట్స్ పెడుతున్నారు. అయితే కెప్టెన్సీ మార్పు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా జరగిందని ముంబై ఫ్రాంచైజీ చెప్పుకొచ్చింది. అయినా కూడా ఇది పద్ధతిగా జరగలేదని ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ముంబై జెర్సీలను తగలబెడుతుండగా.. మరికొంతమంది సోషల్మీడియాలోని ముంబై అఫిషియల్ హ్యాండిల్స్ను అన్ఫాలో కొడుతున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ ఫేక్ ఫాలోవర్స్ను యాడ్ చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Mumbai Indians: ఎంత ఖర్మ పట్టిందిరా బాబు.. రోహిత్ ఫ్యాన్స్ దెబ్బకు ముంబై ఏం చేసిందో చూడండి!
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ను ఎంపిక చేయడం పట్ల ఫ్రాంచైజీపై రోహిత్ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీ నిర్ణయానికి నిరసనగా ఇన్స్టాలో MI పేజీను అన్ఫాలో చేస్తున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ ఫేక్ ఫాలోవర్స్(బాట్)ను తెచ్చుకుంటుందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
Translate this News: