ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసింది. ఇందులో ముఖ్యంగా ‘మహాలక్ష్మీ పథకం’లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అయితే ఈ ఉచిత ప్రయాణం ఎఫెక్ట్ తో ఇప్పటికే ఆర్టీసీ, పల్లెవెలుగు బస్సులన్నీ కిక్కిరిపోతున్నాయి. దీంతో పురుషులకు సీట్లు దొరకని సందర్భాలు ఎదురుకావడంతో కొంతమంది దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మహిళలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా ఉపాధ్యాయులు మాత్రం ఉచిత ప్రయాణ విషయంలో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచారు.
పూర్తిగా చదవండి..మాకు ఫ్రీ వద్దు.. బస్సు టికెట్ కొంటామంటున్న అక్కడి మహిళలు
ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం గవర్నమెంట్ మహిళా టీచర్స్ ఆదర్శవంతమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ అందించే ఫ్రీ టికెట్ తమకు వద్దని, టికెట్ తీసుకుని గవర్నమెంట్ కు తమవంతు ఆర్థిక సహాయం అందిస్తామని ముందుకొచ్చారు. మంచి మనసుతో మరింతమంది స్ఫూర్తిగా నిలవాలని కోరారు.
Translate this News: