Tiger Attack Cotton Workers : విజ్ఞానం వెర్రి, భయంకరమైన స్వార్థంతో మానవుడు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన వినాశాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు. ఫలితంగా అడవిలో బతకాల్సిన జంతువులు ఇటీవల కాలంలో జనవాసాల బాట పడుతున్నాయి. పచ్చని అడవిలో సేదతీరాల్సిన వన్యప్రాణులు పల్లెలు, పట్టణాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అంతరించిపోతున్న అడవుల్లో ఆహారం దొరకకపోవడంతో గ్రామాల్లోకి తరలుతున్న పులులు, గుడ్డేలుగులు పెంపుడు జంతువులతోపాటు మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల ప్రజలు పులుల సంచారంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే.. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటచేలకు వెళ్లిన కూలిలపై దాడులకు పాల్పడుతూ భీభత్సం సృష్టిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..పత్తి కూలీలపై పులుల దాడి.. ఆ జిల్లాను వణికిస్తున్న కృర మృగాలు
కొమురం భీం జిల్లాలో పులుల సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు నుంచి నాలుగు పులులు తిరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో వరుస దాడులు చేయగా ఇప్పపటికే పలువురు పత్తి కూలీలు పులుల దాడిలో మరణించారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Translate this News: