కాళేశ్వరం(Kaleshwaram).. తెలంగాణ ఎన్నికలు దీని చుట్టూనే తిరిగాయి. కేసీఆర్ టార్గెట్గా రేవంత్ నుంచి షర్మిల వరకు అందరూ ఇదే విషయాన్ని దాదాపు అన్నీ సభల్లోనూ లేవనేత్తారు. 2జీ, కోల్గేట్ కంటే కాళేశ్వరం కుంభకోణం పెద్దదంటూ బీఆర్ఎస్పై కాంగ్రెస్ దాడి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అవకతవకలను జాతీయ స్థాయిలో బహిర్గతం చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు స్పీచ్ల్లో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం కాంగ్రెస్కే వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఇది జరిగిన కాసేపటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు అందింది.
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు.. కొత్త సీఎం యాక్షన్ ఏంటి?
కాళేశ్వరం ప్రాజెక్టులో తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీకి కంప్లైంట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు,కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని కోరారు.
Translate this News: