Team India South Africa Tour: వరల్డ్ కప్ ఫైనల్స్ లో అనూహ్య ఓటమి తరువాత టీమిండియా.. ఆసీస్ తో టీ20 సిరీస్ గెలుచుకుని సూపర్ ఫామ్ లో ఉంది. ఇప్పటికే వన్డేల్లో.. టీ20ల్లో చాలా రికార్డులను తమ ఖాతాల్లో వేసుకున్న టీమిండియా క్రికెటర్లు ఇప్పుడు సౌతాఫ్రికాలో రికార్డులు సృష్టించాలని రెడీ అయిపోయారు. ఇప్పటివరకూ సౌతాఫ్రికాలో సాధ్యం కాకుండా ఉండిపోయిన రికార్డులను ఛేదించడమే టార్గెట్ గా.. 3 టీ20లు, 3 వన్డేలు – 2 టెస్టులు. అంటే మొత్తం 8 మ్యాచ్ లు ఆడటానికి విమానం ఎక్కేశారు భారత్ ఆటగాళ్లు. ప్రపంచ కప్ తరువాత తొలి విదేశీ పర్యటన కావడంతో ఇటు అభిమానులు.. అటు టీమ్ మేనేజిమెంట్ కూడా ఈ టూర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ టూర్ లో చాలామంది యువ – కొత్త ఆటగాళ్లు మొదటిసారి సౌతాఫ్రికాలో ఆడటానికి వెళుతున్నారు. వారిలో చాలామందికి ఇదే తొలి విదేశీ టూర్(Team India South Africa Tour) కూడా. అందుకే వారాంతా టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకోవడం కోసం ఈ టూర్ ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో అందరూ కొత్త ఉత్సాహంతో తమని తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు.
పూర్తిగా చదవండి..Team India South Africa Tour: చరిత్ర సృష్టించడమే టార్గెట్.. దక్షిణాఫ్రికా టూర్ కు విమానమెక్కిన టీమిండియా..
చరిత్ర సృష్టించడమే టార్గెట్ గా టీమిండియా వరల్డ్ కప్ తరువాత తొలి విదేశీ టూర్ కు బయలుదేరింది. సౌతాఫ్రికాతో డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్.. ఆతరువాత టెస్ట్ సిరీస్.. వన్డే సిరీస్ లను గెలవడమే ధ్యేయంగా మూడు వేర్వేరు జట్లు.. కెప్టెన్ లు తమ ప్రయాణం ప్రారంభించారు.
Translate this News: