ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ ప్రాంతాలకు సురక్షితంగా చేర్చేందుకు భారతీయ రైల్వే తీవ్రంగా కృషి చేస్తోంది. ఉపాధి, తదితర అవసరాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలను తిరిగి తమ గమ్య స్థానాలకు చేర్చడంకోసం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పండగ సీజన్ లో ప్రత్యేక ఆఫర్లు కల్పిస్తున్న రైల్వే అధికారులు.. దైవ దర్శనాలు, రద్దీగా ఉండే సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మళ్లీ పొడిగించబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రైల్వే జోన్ అధికారులు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించారు.
పూర్తిగా చదవండి..ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు
భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 22 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు షెడ్యూల్ వారీగా సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
Translate this News: