ఈ సారి వన్డే వరల్డ్కప్(World Cup)కు ప్రిపరేషన్ లేదన్న విమర్శలు ఉన్నాయి. అంటే ఈ ఏడాది వరల్డ్కప్కు ముందు వరకు ప్రధాన ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వలేదు బీసీసీఐ(BCCI). సెలక్టీవ్గా మ్యాచ్లు ఆడించకుండా చిన్నాచితక సిరీస్లలో కూడా ఆడించి అలిసిపోయేలా చేసిందన్న టాక్ ఉంది. ముఖ్యంగా వరల్డ్కప్కు రెండేళ్ల ముందు నుంచి ప్రిపరేషన్ ఉండాలని.. బీసీసీఐ ఆ దిశగా అడుగులు వెయ్యలేదన్న ఆరోపణలు ఉన్నాయి. వచ్చే వరల్డ్కప్కు ఇలా జరగకుండా ఉండాలంటే నాలుగేళ్ల ముందు నుంచే ప్లాన్ అవసరమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగానే బీసీసీఐ పలు మార్పులుకు పూనుకుందని సమాచారం. మూడు ఫార్మెట్లలో మూడు వెర్వేరు కెప్టెన్ల ఫార్ములాను ఇప్పటికే పలు దేశాలు ఫాలో అవుతుండగా.. తాజాగా ఈ లిస్ట్లో ఇండియా కూడా వచ్చి చేరింది. దక్షణాఫ్రికాతో జరగనున్న టీ20, వన్డే, టెస్టు జట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను నియమించింది బీసీసీఐ.
పూర్తిగా చదవండి..IND VS SA: టుక్ టుక్ ప్లేయర్కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా!
రానున్న దక్షిణాఫ్రికాతో సిరీస్లో మూడు ఫార్మెట్లకు మూడు వేర్వేరు కెప్టెన్లను నియమించింది బీసీసీఐ. వన్డే కెప్టెన్గా కేఎల్ రాహుల్ని సెలక్ట్ చేయడం పట్ల ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దూకుడుగా వ్యవహరించే కెప్టెన్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Translate this News: