సిరిసిల్ల జిల్లా దాచారంకు చెందిన విజయ్ పోలింగ్ స్టేషన్కు వెళ్లాడు. తన లైఫ్లో వెయ్యనున్న తన తొలి ఓటు ఇదే కావడంతో ఎంతో ఎక్సైటింగ్గా పోలింగ్ బూత్లోకి అడుగుపెట్టాడు. తొలిసారి ఓటు వేస్తున్నానన్న ఆనందం అతని కళ్లలో క్లియర్గా కనిపిస్తోంది. చెంగుచెంగున పోలింగ్ బూత్లోకి వెళ్లిన విజయ్కు లోపలకు వెళ్లగానే షాక్ తగిలింది. తన పేరును స్ట్రైక్ చేసి ఉంచారు అక్కడి అధికారులు. ఇదేంటి నా పేరును ఎందుకు కొట్టేశారని అక్కడి అధికారులను అమాయకంగా ప్రశ్నించాడు. నువ్వు అల్రేడీ ఓటు వేశావ్గా అని అటు నుంచి సమాధానం వచ్చింది. అంతే ఉలిక్కిపడి నిద్రలేచాడు విజయ్. ఇదంతా కల. మొన్నే 20వ ఏటా అడుగుపెట్టిన విజయ్ తన తొలి ఓటు గురించి కలలు కంటూ నిద్రపోయాడు. అందుకే దానికి సంబంధించిన కలే వచ్చింది. అయితే అది మాముల కల కాదు.. పీడ కల.. తన ఓటు ఎవరో వెయ్యడం ఏంటి? విజయ్కు చెమటలు పట్టాయి. నిజంగానే ఇలా జరిగే అవకాశం ఉంది కదా అని అతనికి అనిపించింది. ఒకవేళ అలా జరిగితే ఏం చేయాలన్నదానిపై ఆలోచించాడు. మీడ్నైట్ దాటడంతో ఈ టైమ్లో డాడీకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అనుకున్నాడు. ఇంతలోనే బెడ్పక్కనే ఉన్న ఫోన్ కనపడింది. వెంటనే గూగుల్ తల్లి గుర్తొచ్చింది. నెట్ ఆన్ చేసి తన డౌట్ను టైప్ చేశాడు. వెంటనే గతంలో ఎన్నికల అధికారులు చెప్పిన విషయాలు అతనికి డిస్ప్లేపై కనపడ్డాయి. ఓసీ ఇంతనా అని నెట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. ఇంతకీ ఎవరైనా మన ఓటు దొంగతనంగా వేస్తే ఏం చేయాలన్న డౌట్ మీక్కూడా ఉందా? అయితే ఇది తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..TS Elections 2023: మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే.. టెన్షన్ పడకుండా ఇలా చేయండి!
మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే టెన్షన్ కూడా పడొద్దు. పోలింగ్ బూత్లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ను కలవండి. జరిగింది చెప్పండి. కొన్ని క్రాస్ క్వశ్చన్స్ తర్వాత మీరు చెప్పింది నిజమేనని తేలుతుంది. అప్పుడు మీకు టెండర్ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. దొంగ ఓటును క్యాన్సిల్ చేస్తారు.
Translate this News: