Telangana Elections 2023: ఎన్నికల నేపథ్యంలో కమల దళమంతా తెలంగాణలోనే మోహరించింది. నిన్నమొన్నటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా కలియదిరిగిన ప్రధాని మోదీ (Narendra Modi) సోమవారం ఢిల్లీ వెళ్లగా, అగ్రనేతలు చాలా మంది మంగళవారం కూడా రాష్ట్రంలో పర్యటించారు. ప్రధాని, అగ్రనేతల విస్తృత పర్యటనలతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లాయి. ఏ చిన్న అవకాశాన్నీ ఈ దశలో వదులుకోవద్దని భావించిన అధినాయకులు పార్టీకి పట్టున్న అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. చివరి అంకంలో విస్తృతంగా ప్రచారం జరిపారు.
పూర్తిగా చదవండి..8 సభల్లో మోదీ.. 21 సభల్లో అమిత్ షా: తెలంగాణను చుట్టేసిన బీజేపీ అగ్రనేతలు
తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వాన్ని మొత్తం ప్రచారంలో మోహరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పర్యటన సహా ప్రధాని మోదీ మొత్తం 8 సభల్లో పాల్గొనగా, అమిత్ షా 21 సభల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు నడ్డా 12 సభల్లో ప్రసంగించారు.
Translate this News: