జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసు దేశంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విధులు ముగించుకొని వెళ్తున్న ఆమెపై నలుగురు దుండగులు కాల్పులు జరపగా బుల్లెట్ గాయాలతో ఆమె కారులోనే ప్రాణాలు విడిచారు. 2008 సెప్టెంబర్ 30న ఈ సంఘటన జరగగా ఇన్నాళ్లకు ఈ కేసులో తుదితీర్పు వెల్లడించింది ఢిల్లీ అడిషనల్ సెషన్స్ కోర్టు. ఈ మేరకు దోషులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్కుమార్కు జీవిత ఖైదు విధించింది. ఈ సందర్భంగా గత 14 ఏండ్లుగా వాళ్లు జైలులో ఉంటున్న అంశాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల జరిమానా వేసింది. ఐదో ముద్దాయి అజయ్శెట్టికి మూడేండ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.7.25 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ మొత్తం జరిమానాను బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇది అరుదైన కేసుల పరిధిలోని రానందున ముద్దాయిలకు మరణ శిక్షను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
పూర్తిగా చదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నలుగురు దోషులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్కుమార్కు జీవిత ఖైదు విధించింది. ఐదో ముద్దాయి అజయ్శెట్టికి 3ఏళ్ల జైలుశిక్ష, రూ.7.25 లక్షల జరిమానా విధించింది.
Translate this News: