తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పార్టీ నేతలంతా తమ నియోజకవర్గంలో వేగంగా పర్యటిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలను కలుస్తూ పోటీపడి ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రత్యర్థులు ఎదురైనపుడు ఒకరిపై ఒకరు మాటలతూటాలు పేల్చుకుంటున్నారు. కొంతమంది దారుణంగా దూషించుకుంటున్నారు. కొన్నిచోట్ల దాడులు కూడా చేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు. ఇందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
పూర్తిగా చదవండి..కొడంగల్లో హైటెన్షన్.. తన్నుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో శనివారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి దాడికి పాల్పడ్డట్లు ఫసియుద్దీన్ ఫిర్యాదు చేశారు. పట్నం నరేందర్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
Translate this News: