వరల్డ్ కప్(World cup) ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) కాళ్లు పెట్టడంపై ఇప్పటికీ తీవ్ర దుమారం రేగుతూనే ఉంది. ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. మార్ష్ ప్రవర్తనను క్రికెటర్స్ కూడా తప్పుబడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఆటగాళ్లంతా ఆ ట్రోఫీ కోసం ఎంతో పోరాడుతారని.. తలపై పెట్టుకోవాల్సిన ట్రోఫీపై కాళ్లు పెట్టడం బాధ కలిగించిందన్నారు.
మానసికంగా ధృడంగా ఉండాలి:
వరల్డ్ కప్ టోర్నీలో మంచి ఫామ్లో ఉండి పలు రికార్డులు సృష్టించిన షమీ..మొదటి నాలుగు మ్యాచులకు దూరమవడంపైనా స్పందించారు. బెంచ్లో కూర్చున్నప్పుడు మానసికంగా ధృడంగా ఉండాలన్నాడు షమీ. ఆటగాళ్లు పలుమార్లు ఒత్తిడికి లోనవుతుంటారని..కానీ జట్టు మంచి ఫెర్మార్మ్ చేస్తున్నప్పుడు సంతోషంగా ఉంటుందన్నాడు. ఇక క్రికెట్ పిచ్ల స్వభావాన్ని ముందుగా పరిశీలించడంపై తనకు అంత నమ్మకం లేదన్నారు. బౌలింగ్ చేసినప్పుడు మాత్రమే పిచ్ స్వభావం అర్థమవుతుందన్న షమీ..ప్రశాంతంగా ఉంటే మెరుగ్గా రాణిస్తామన్నాడు.
SHAMI: ట్రోఫీపై కాళ్లు.. షమీ స్ట్రాంగ్ రియాక్షన్.. ఏమన్నాడంటే..!
తలపై పెట్టుకోవాల్సిన ట్రోఫీపై కాళ్లు పెట్టడం బాధాకరమన్నారు టీమిండియా స్టార్ పేసర్ షమీ. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ తీరు బాధ కలిగించిందన్నాడు. ఇక బెంచ్లో కూర్చున్నప్పుడు మానసికంగా ధృడంగా ఉండాలని.. పిచ్ల స్వభావాన్ని ముందుగా పరిశీలించడంపై నమ్మకం లేదని చెప్పాడు.
Translate this News: