Janasena: విజయవాడ పంజా సెంటర్లో ఫుడ్ కోర్ట్ కి వ్యతిరేకంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ..విజయవాడ నగరంలో ఫుడ్ కోర్ట్ మాఫియా నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజా సెంటర్లో ఫుడ్ కోర్టుకు ప్రజాభిప్రాయ, స్థానిక వ్యాపారస్తుల అభిప్రాయ సేకరణ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. చిరు వ్యాపారస్తుల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి కాబట్టే కూల్చి వేస్తామని స్పష్టం చేశారు. సామాన్య వర్గాలకు అండగా నిలబడేందుకు కేసులకి రిమాండ్లకు భయపడేది లేదని ఖరకండిగా చెప్పేశారు.
పూర్తిగా చదవండి..విజయవాడలో ఫుడ్ కోర్ట్ మాఫియా..జనసేన పోతిన మహేష్ షాకింగ్ కామెంట్స్.!
విజయవాడలో ఫుడ్ కోర్ట్ మాఫియా నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన నేత పోతిన మహేష్. పంజా సెంటర్లో ఫుడ్ కోర్ట్ కి వ్యతిరేకంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ నిర్మాణంతో చిరు వ్యాపారస్తుల జీవితాలు చిన్నాభిన్నమవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: