Telangana Elections 2023: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం రోజురోజుకూ మారుతోంది. నిన్నమొన్నటి వరకూ వెలువడిన సర్వేలన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ అని తేల్చేయగా ఆ అంచనాలను తలకిందులు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో మూడో వంతు స్థానాల్లో ఫలితాలను శాసించగల స్థాయిలో ఉన్న కమల దళం మరింత బలం పుంజుకునేలా తాజా కార్యాచరణను రూపొందించింది. పది రోజుల క్రితం వరకూ కొంత స్తబ్ధుగానే ఉన్న బీజేపీ శ్రేణుల్లో ప్రధాని నరేంద్రమోదీ భాగ్యనగర పర్యటన, మాదిగ విశ్వరూప మహాసభ జోష్ నింపాయి. మరోవైపు రాజస్థాన్ ఎన్నికలు కూడా ముగియడంతో పార్టీ మహారథులంతా తమ అస్త్రశస్త్రాలను తెలంగాణ వైపు మల్లించారు. ఎన్నికల పర్వం తుది అంకానికి చేరిన వేళ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు తలపెట్టారు.
పార్టీకి పట్టున్న చోట ప్రధాని మోదీ సభలు:
ఈ నెల 25 నుంచి వరుసగా మూడురోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తారు. మొదటి రోజు హైదరాబాద్ లో కార్యక్రమాలతో పాటు కామారెడ్డి, మహేశ్వరంలో ప్రధాని మోదీ సభలుంటాయి. ఆ రోజు రాత్రి రాజ్భవన్లో బస అనంతరం 26న ఉదయం కన్హ శాంతివనంలో జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అదే రోజు తుప్రాన్, నిర్మల్లో బహిరంగ సభల్లో మోదీ ప్రసంగిస్తారు. మరునాడు 27న మహబూబాబాద్, కరీంనగర్లలో నరేంద్రమోదీ సభలుంటాయి. ఇలా పార్టీకి ఇప్పటికే గట్టి పట్టున్న చోట్ల సభలు నిర్వహించడం ద్వారా విజయావకాశాలు మరింత బలపడతాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
BJP: జెండా పాతాల్సిందే: తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ.. వరుస పర్యటనలతో కార్యాచరణ
పార్టీపై సానుకూలత పెరిగిందన్న విశ్లేషణల నేపథ్యంలో తెలంగాణలో సర్వశక్తులొడ్డి ప్రజల్లోకి వెళ్లాలని కమలదళం భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ హేమాహేమీలంతా తెలంగాణకు వరుస కడుతున్నారు. చివరివారంలో బీజేపీ నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు తలపెట్టారు.
Translate this News: