Telangana Elections 2023: మాజీ ఎంపీ, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్(G Vivek)కు ఎన్నికల సమయంలో షాక్ తగిలింది. వివేక్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు వెళ్లిన రూ. 8 కోట్లు.. వ్యాపారంలో భాగంగా జరిగిన లావాదేవీ కాదని ఈడీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిందని, వివేక్ కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా పేర్కొన్న ఈడీ అధికారులు ఆయనపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల విశాఖ ఇండస్ర్టీస్కు చెందిన బేగంపేటలో ఉన్న ఓ బ్యాంకు నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్కు చెందిన ఆదర్శ్ నగర్లో ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి 8 కోట్ల రూపాయలు రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ పద్దతిన ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్కు చెందిన ఖాతా వివరాలను తెలుసుకుని ఆ 8 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఈ సమాచారాన్ని ఈడీ, ఆదాయపు పన్ను శాఖతోపాటు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: బాబోయ్ అన్ని కోట్లా?.. వివేక్కు ఈడీ బిగ్ షాక్.. డ్రామా మొత్తం రివీల్..
చెన్నూరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్కి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనపై ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. ఆయన నడుపుతున్న బోగస్ కంపెనీల వివరాలు, లావాదేవీలు జరిగే తీరుతెన్నులు వెల్లడించింది. తాజాగా రూ. 200 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.
Translate this News: