అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, గవర్నమెంట్ ఆఫీసులకు పోలింగ్ సందర్భంగా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పని చేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ కార్మిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
పూర్తిగా చదవండి..సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. ఆ రోజు పనిచేయకపోయిన వేతనాలు
సింగరేణి కార్మికులకు తమ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ కార్మికులకు సెలవు ప్రకటించింది. పోలింగ్ జరిగే నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Translate this News: