కరీంనగర్ నియోజకవర్గంలోని బావూపేటలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు హాజరై బండికు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను నోరు విప్పితే కరీంనగర్ రోడ్లపై తిరగలేవని సంజయ్ హెచ్చరించారు. గంగుల , కేసీఆర్ మీరు నిజమైన హిందువులైతే ఒవైసీ సోదరులను హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చి బొట్టు, హనుమాన్ చాలీసా చదివించే దమ్ముందా? అంటూ ప్రశ్నించారు. నేనెటువంటి వాడినో కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు. బిడ్డా..నన్ను అవినీతిపరుడని అంటున్నావ్ నేను నోరు విప్పితే నువ్వు, కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతారు జాగ్రత్త అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Telangana Election 2023: నీ ఆస్తిపాస్తులన్నీ ప్రజలకు పంచే దమ్ముందా..?: బండి సంజయ్
తెలంగాణ ఎన్నికల వేళ గంగుల కమలాకర్ మీద బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అక్రమంగా సంపాధించిన ఆస్తులు ఏమున్నాయో నిరూపిస్తే.. వాటిని కరీంనగర్ ప్రజలకు పంచేందుకు సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు.
Translate this News: