1983 World Cup: ఇప్పుడంటే క్రికెటర్లకు సకాల సదుపాయాలు, అత్యాధునిక వసతులు, స్పెషల్ ట్రైనింగ్, వరల్డ్ క్లాస్ కోచింగ్, టాప్ స్పాన్సర్లు, వేల కోట్ల బిజినేస్.. కానీ 1983కి ముందు ఇవేవీ లేవు.. టీమిండియా ఒక పసికూన జట్టు. ఎలాంటి అంచనాలు లేని జట్టు.. 1983 వరల్డ్కప్లో భారత్ అండర్డాగ్స్గానే బరిలోకి దిగింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన మూడో వన్డే వరల్డ్కప్లో భారత్ జట్టు ఒక్క మ్యాచైనా గెలుస్తుందా అని అంతా అనుకున్నారు. గవాస్కర్(Gavaskar), కపిల్ దేవ్(Kapil dev) లాంటి స్టార్లు ఉన్నా.. జట్టుగా రాణించలేదని అంచనాలు వేశారు. కానీ టోర్ని మొదలైన తర్వాత టీమిండియా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టోర్నీలో సత్తా చాటింది. ఫైనల్లో అప్పటికీ రెండు సార్లు వరల్డ్కప్ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ను ఓడించింది. విశ్వవిజేతగా ఆవర్భవించింది.
సమిష్టి కృషి:
ఫైనల్లో వెస్టిండీస్ని మట్టికరిపించడం భారత్ క్రికెట్ దశా, దిశను మార్చేసింది. భారత్ క్రికెట్ తలరాతను మార్చిన విజయం ఇది. ఈ విజయం తర్వాత క్రికెట్కు దేశంలో కొత్త ఊపు వచ్చింది. 1983 వరల్డ్కప్లో భారత్ జట్టు 8 మ్యాచ్లు ఆడగా.. అందులో 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అప్పట్లో వన్డే మ్యాచ్లు 60 ఓవర్లకు జరిగేవి. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 54.4 ఓవర్లలో 183 రన్స్కి ఆలౌట్ అయ్యింది. జట్టులో కృష్ణమాచారి శ్రీకాంత్ టాప్ స్కోరర్. 57 బంతుల్లో 38 రన్స్ చేశాడు చీకా. అందులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ కూడా ఉంది.
World Cup: అండర్ డాగ్స్గా బరిలోకి దిగి.. ప్రపంచాన్ని జయించి..! తలరాతను మార్చిన వీరులు వీరే!
1983లో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. కపీల్దేవ్ కెప్టెన్సీలో దిగ్గజ వెస్టిండీస్ జట్టును మట్టికరిపించి విశ్వవిజేతగా ఆవర్భవించింది. ఇండియా గెలవడంతో ఆల్రౌండర్ మొహిందర్ అమర్నాథ్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీ మొత్తం ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థులపై ప్రతాపం చూపాడు.
Translate this News: