జీవితం మారిపోవడానికి ఒక్క క్షణం చాలు.. ఆ ఒక్క క్షణంలో ఆకాశమంతా ఎత్తుకు వెళ్లవచ్చు.. పాతాళానికీ పడిపోవచ్చు.. ఎంతైనా లక్ కూడా ఉండాలి. కొంతమందికి అధృష్టం వైఫై లాగా చుట్టూనే ఉంటుంది.. మరికొందరికి శని నెత్తిపైనే నాట్యమాడుతుంది. కేరళ(Kerala)కు చెందిన 39 ఏళ్ల శ్రీజు(Sreeju) 11 సంవత్సరాలుగా దుబాయ్(Dubai)కు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలోని ఫుజైరాలో నివసిస్తున్నాడు. ఓ పరిశ్రమలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. బాగా డబ్బులు సంపాదించి సొంతిల్లు కట్టుకోవాలన్నది అతని డ్రీమ్. ఈ లక్ష్యంతోనే పొట్టకూటికోసం సొంతూరును విడిచిపెట్టి దుబాయ్కు వెళ్లాడు. అక్కడ అతని లైఫే మారిపోయింది.
పూర్తిగా చదవండి..Viral News: ఒక్క క్షణంలో రూ.45 కోట్లు సంపాదించాడు.. ఎలానో తెలుసా..?
దుబాయ్లో 11ఏళ్లుగా కంట్రోల్ రూమ్ ఆపరేటర్గా పని చేస్తున్న కేరళకు చెందిన శ్రీజు నక్క తోక తొక్కాడు. దుబాయ్లో నిర్వహించిన ఓ లక్కీడ్రాలో అతను రూ.45కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. యూఏఈలో లాటరీ టిక్కెట్లను ఎక్కువగా కొనుగోలు చేసేవారు భారతీయులేనని నివేదికలు చెబుతున్నాయి.
Translate this News: