బీజేపీ ఫైర్బ్రాండ్గా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి రఘునందన్రావు (Raghunandan Rao). బీఆర్ఎస్ కంచుకోటలైన సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు అత్యంత సమీపంలో ఉన్న దుబ్బాక ఉపఎన్నికలో అనూహ్యంగా బీజేపీ జెండా పాతి సంచలనం సృష్టించారు ఆయన. తరచూ టీవీ డిబేట్లలో పాల్గొంటూ, వాగ్ధాటితో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టగల సమర్థుడిగా పేరుపొందిన వకీల్ సాబ్ కీలకమైన ఈ ఎన్నికల సమయంలో స్థాయికి తగ్గట్టు క్రియాశీలకంగా లేరన్నది విశ్లేషకుల పరిశీలన. పార్టీ భావజాలాన్ని బలంగా వ్యాప్తి చేయగల చరిష్మా ఉన్నప్పటికీ ఆయన తన నియోజకవర్గం దాటి తిరగకపోవడం ఇంటాబయటా చర్చనీయమవుతోంది.
ఇది కూడా చదవండి: TS Politics: బీజేపీ ప్రచారంలో కనిపించని రాములమ్మ.. కారణమిదేనా?
TS Politics: రఘునందన్ ఎక్కడ? దుబ్బాక ఎందుకు దాటడం లేదు?
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు కీలకమైన ఎన్నికల సమయంలో తన నియోజకవర్గానికే పరిమితమవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయనే స్వీయ పరిమితి విధించుకున్నారా; ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని పరిశీలకులతో పాటు కార్యకర్తలూ చర్చించుకుంటున్నారు.
Translate this News: