శ్రీలంక(Srilanka) సభ్యత్వాన్ని ఐసీసీ(ICC) రద్దు చేసిన విషయం తెలిసిందే. క్రికెట్లో చాలా కాలం పాటు మేటి జట్లలో ఒకటిగా నిలిచిన శ్రీలంకకు ఐసీసీ తీసుకున్న నిర్ణయం పెద్ద షాక్గానే చెప్పాలి. 1996 ప్రపంచకప్ విజేత శ్రీలంక ఇకపై ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తోంది. నిషేధానికి సంబంధించిన పూర్తి వివరాలను ఐసీసీ ఇప్పటివరకు చెప్పలేదు. అయితే వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్లో శ్రీలంక పాల్గొనే ఛాన్స్ లేదని క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. క్రికెట్ బోర్డులో శ్రీలంక ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఐసీసీ సమావేశంలో తేలింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. అందుకే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ(Arjuna Ranatunga) చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.
పూర్తిగా చదవండి..Cricket: అంతా జయ్ షానే చేస్తున్నాడు.. ఐసీసీ నిర్ణయంపై లెజెండరీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
కేంద్ర హోం మంత్రి అమిత్షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జయ్ షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేయగా.. తమ దేశ క్రికెట్ బోర్డును నాశనం చేసింది జయ్షానే అంటూ రణతుంగ బాంబు పేల్చారు.
Translate this News: