ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మందిని బలి తీసుకున్న నాంపల్లి రెడ్హిల్స్అగ్నిప్రమాదానికి భవన యజమాని రమేశ్ జైస్వాల్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ తేల్చింది. పార్కింగ్కోసం కట్టిన స్టిల్ట్ఫ్లోర్తో పాటు…సెట్బ్యాక్ ప్రాంతాల్లో కూడా తేలికగా మండే స్వభావమున్న రసాయనాల డ్రమ్ములు ఇతర వస్తువులను నిల్వ చేయటమే ఇంతటి విషాదానికి దారి తీసిందని నిర్ధారించింది. భవనం నుంచి బయటకు రావటానికి కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉండటం… అగ్నిప్రమాదం సంభవించగానే ఆ మార్గం అంతా దట్టమైన పొగ అలుముకోవటంతో లోపల ఉన్నవారు బయటకు రాలేక ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపింది. ఇక, ప్రమాదానికి బల్దియా నిర్లక్ష్యం కూడా కారణమని స్పష్టమవుతోంది. ఆ ప్రాంతంలో జీ ప్లస్2 అంతస్తుల భవనాలు నిర్మించటానికి మాత్రమే అనుమతులు ఉండగా రమేశ్ జైస్వాల్జీ ప్లస్4 అంతస్తులు…ఆపై పెంట్హౌస్కట్టినా చర్యలు తీసుకోవటంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించిన రమేశ్ జైస్వాల్అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ కూడా తీసుకోకపోవటం.
పూర్తిగా చదవండి..Nampally Fire Accident: ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఫైవ్ రీజన్స్ ఇవే!
ఈరోజు ఉదయం నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి కీలక విషయాలను అగ్నిమాపక శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలను వివరించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
Translate this News: