Ambedkar Konaseema District: దీపావళి పండగ రోజున ఇల్లు దోచేశారు దొంగలు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగల బీభత్సం సృష్టించారు. ఎవరు లేని సమయంలో తలుపుల తాళాలు పగలకొట్టి బీరువాలోని బంగారం, నగదును దుండగులు ఎత్తుకుని వెళ్ళిపోయ్యారు. దీపావళి సెలవులు రావడంతో పాలకొల్లు బంధువులు ఇంటికి వెళ్లిన సమయంలో ఇంటి దోపిడీ జరిగింది. సుమారు రూ.17 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారం, లక్షా 32 వేలు నగదు దొంగలు దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలతో దర్యాప్తు చేసి నిందితులు పట్టుకుంటామని డీఎస్పీ అంబిక ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పూర్తిగా చదవండి..AP News: పండగ రోజు ఇల్లు గుల్ల.. అమలాపురంలో దొంగల బీభత్సం
ఏపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరస దొంగతాలు చేస్తూ ప్రజలు భయబ్రతులకు గురి చేస్తున్న దొంగలు. పండగ సందర్భంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి అందినకాడికి దొచుతెళ్తున్నారు. తాజాగా మరో ఘటన కలకలం రేపింది.
Translate this News: