karumuri nageswara rao: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో ఏపీ, తెలంగాణలను పోల్చుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. ఓట్లకోసం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలా మాట్లాడడం సరికాదని సూచించారు. ఏపీ గురించి కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, కానీ కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేయని మేలు ఏపీలో చేశామన్నారు. కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజలను గాలికి వదిలేశారని, కానీ, ఏపీలో ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేశామని అన్నారు.
పూర్తిగా చదవండి..ఓట్లకోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్ పై ఏపీ మంత్రి వార్నింగ్..!!
కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకోసం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణలను పోల్చుతూ కేసీఆర్ ఇలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదని హెచ్చరించారు.
Translate this News: