అసలు ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నాక ఇవన్నీ సమస్యలే కాదని టీఆర్ఎస్ నుంచి బీజేపీ లో చేరిన ఓ కీలక నేత అన్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. ప్రాంతీయ పార్టీతో ప్రకంపనలు సృష్టించిన ఎన్టీఆర్ 1989లో తనే ఓడిపోవడం ఇందుకో ఉదాహరణ గా ఆయన చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త రాష్ట్ర సాధన సెంటిమెంట్ ఉన్నా.. పదేళ్ల కాలంతో అది అలాగే ఉండదని తెలుసు. నిజానికి 2018 ఎన్నికల లోనే డబ్బు బాగా ప్రభావం చూపిందంటారు. సంక్షేమ పథకాలు ఉన్నా కాంగ్రెస్ అదే బాట తీసుకుంది. రాజకీయంగా బీజేపీ పై యుద్ధం ప్రకటించి తీవ్రత తగ్గడం మైనార్టీలు, సామాజిక తరగతులపై ప్రతికూలంగా పనిచేయొచ్చు. దేశవ్యాప్తంగా ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మరలుతున్నట్టు పరిశీలనలు చెబుతున్నాయి. బలమైన నేతలు చాలామంది కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి అదే కారణంగా చెబుతున్నారు. టికెట్ వచ్చిన వారు కూడా వెళ్లి పోవడం గతంలో జరిగుండదు. కేసీఆర్ సభల్లో గతంలోని జోష్ తగ్గిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ చొరవతో పార్టీ కొన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా.. సరిపోతుందా? ఇంకా ఏం చేయాలనే ప్రశ్న బీఆర్ఎస్ ను వెన్నాడుతోంది. బీజేపీ ఆశించిన స్థాయిలో ఓట్లు చీల్చగల సత్తా చూపలేకపోతోంది. మజ్లీస్ ను కూడా ముస్లిం పెద్దలు గెలిచే సీట్ల కే పరిమితం కమ్మని ఒత్తిడి పెడుతున్నారట.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: కాంగ్రెస్ హవా నిజమవుతుందా?
ఓ దశాబ్ది కాలం తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ కళ మారుతోందా? రేవంత్ రెడ్డి దూకుడు ఫలితమిస్తుందా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల వ్యూహం కర్ణాటక లాగే పొరుగు న కూడా ఫలిస్తుందా? రాజకీయ వేత్తలనే కాకుండా సామాన్య ప్రజలనూ ఆలోచింపజేస్తున్న ప్రశ్నలివి. కాంగ్రెస్లో అనైక్యత, ఎకనాయకత్వం లేకపోవడం లోపాలు అని కొందరంటున్నా.. అవే అనుకూలాంశాలుగా మారొచ్చని పరిశీలకులు అంటున్నారు.
Translate this News: