విధి నిర్వహణలో తాను ఎంతో బాధ్యతగా ఉండేవాడు. ఆ బాధ్యతతోనే తన బస్సులో ఎక్కిన ప్రతి ప్రయాణికుడిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేవాడు. ఒకవేళ అనుకొని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం ముంచుకు వచ్చినా.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ప్రయాణికులను కాపాడేవాడు. తన బస్సులో ప్రయాణిస్తున్న 48 మంది ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడాడు ఈ బస్సు డ్రైవర్.
పూర్తిగా చదవండి..తాను చనిపోతూ కూడా 48 మందిని బతికించిన డ్రైవర్!
సనా ప్రధాన్ అనే వ్యక్తి ఒడిశా లో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజులాగానే విధి నిర్వహణలో భాగంగా ఆదివారం కూడా 48 మంది ప్రయాణికులను బస్సులో ఎక్కించుకుని భువనేశ్వర్ కి బయల్దేరాడు. బస్సు కొంచెం దూరం ప్రయాణించగానే..డ్రైవర్ కి ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. వెంటనే బస్సు వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చాడు. ఒక్కసారిగా బస్సు ఆపకుండా దగ్గరలో ఉన్న ఓ గోడను ఢీకొట్టాడు. దీంతో బస్సు ఆగిపోయింది.
Translate this News: