ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్ పట్టుకొనే కనిపిస్తున్నారు. కరోనా తర్వాత స్మార్ట్ ఫోన్ వినియోగం మరింత పెరిగింది. ఏదో ఒక కారణంతో ఫోన్తో పని పడుతోంది. అయితే చాలామంది పిల్లలు వర్క్ లేని టైమ్లో కూడా అదే పనిగా ఫోన్ చూస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అటు కొంతమంది తల్లిదండ్రులు సైతం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందులో కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల స్మార్ట్ ఫోన్ వినియోగించడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నారు కూడా.. ‘మా అబ్బాయి LKG లోనే స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు’ అని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారికి షాకింగ్ న్యూస్. మీ పిల్లల స్మార్ట్ ఫోన్ యూసేజ్ని పరిమితం చేయకపోతే వాళ్లు ప్రమాదంలో పడినట్లే లెక్క. ఇది పరిశోధకులు చెబుతున్న మాట.
పూర్తిగా చదవండి..Child Health: మీ పిల్లలు పదేపదే ఫోన్ చూస్తున్నారా? సైంటిస్టుల షాకింగ్ ప్రకటన..!
రోజుకు 4 గంటల కంటే ఎక్కువగా ఫోన్ యూజ్ చేసే పిల్లలు ఆటిజం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు మందబుద్ధికి గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. మొత్తం 437 మంది పిల్లల డీఎన్ఏపై ఈ రీసెర్చ్ జరిగింది.
Translate this News: