ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ నేతలు తమ మాటలకు పదును పెడుతున్నారు. టైమ్ చూసుకోని ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాది గ్రామంలో డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యంను కలిసి పార్టీలో కలిసి పనిచేయాలని కోరిన మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అదేశానికి కట్టుబడి ఉండి చింతా ప్రభాకర్తో కలిసి ఎన్నికల్లో సంగారెడ్డిలో బీఆర్ఎస్ జెండా పాతుతామని పట్నం మాణిక్యం హామీ ఇచ్చారన్నారు హరీశ్రావు. పార్టీ మాణిక్యంను, అనుచరులను కాపాడుకుంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో పట్నం మాణిక్యంకు పార్టీ మంచి అవకాశం కల్పిస్తోందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Harish Rao: ‘ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే పని అయ్యేది’.. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్!
ధరణి వద్దు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ తెస్తారా అంటూ కాంగ్రెస్పై విమర్శలు చేశారు మంత్రి హరీశ్రావు. కర్ణాటక రైతులు అక్కడి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారన్నారు. ఉద్యమకారులుపై తుపాకీ పట్టిన వ్యక్తులు ఇప్పుడు రాష్ట్రం కోసం ఎగబడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీశ్రావు. రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్ అంటూ కొనియాడారు హరీశ్రావు.
Translate this News: