విజయదశమి రోజున టీడీపీ-జనసేన కలయిక రాష్ట్రానికి మేలుచేసే కలయిక అన్నారు టీడీపీ నేత నారా లోకేశ్. 2014లో నవ్యాంద్రకు రాజధానిలేదు, సమర్థవంతమైన నాయకుడు కావాలని ఆనాడు పవన్ తమకు మద్దతు తెలిపారన్నారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకోసమే కలసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం మంజీరా హోటల్లో టీడీపీ-జనసేన జేఏసీ తొలి సమావేశం తర్వాత లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న 100 రోజుల్లో ఎలా కలసి ముందుకెళ్లాలనే విషయమై ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. నాలుగున్నర సంవత్సరాలుగా సామాజిక అన్యాయం జరుగుతోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయని చెప్పారు.
తన అక్కను వేధిస్తున్న వాడిని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని వైసీపీ నాయకుడు కొడుకు పెట్రోలు పోసి తగులబెట్టారన్నారు. బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేయడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్ ను వైసిపి ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఎందరో దళితులను వెంటాడి చంపారని తెలిపారు. దళితులకు రావాల్సిన 27సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. ఇస్లాంలో ఆత్మహత్య మహా పాపం, నంద్యాలలో అబ్దులో సలాంను వైసిపి నేతలు వేధించడంతో వారి కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు లోకేశ్. పలమనేరులో మిస్బా అనే బాలిక వైసిపి నాయకుడి వత్తిడితో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.
Lokesh pawan: జేఏసీ సమావేశంలో 3 తీర్మానాలు.. కరువు-జగన్ కవలపిల్లలు!
2024లో వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనన్నారు నారా లోకేశ్. రాజమండ్రి వేదికగా చారిత్మాత్మక జేఏసీ సమావేశం జరిగిందన్నారు. ప్రజాసమస్యలపైనే ఉమ్మడి సమావేశంలో పవన్తో కలిసి చర్చించామన్నారు. నవంబర్ 1 నుంచి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళతాం అన్నారు లోకేశ్.
Translate this News: