Bandi Sanjay Shocking Comments On Minister KTR: మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే తమ పరువు పోయేదన్నారు బండి సంజయ్. మొన్న కాలేశ్వరం మోటార్లు మునిగిపోయాయని.. ఇవాళ ప్రాజెక్టు కుంగిపోయిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకున్న కేసీఆర్ నుంచే డబ్బులు వసూలు చెయ్యాలన్నారు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ఎక్కడున్నా బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ జమ్మి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదు..కేటీఆర్ ది బిచ్చపు బతుకు..!!
మంత్రి కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ బండీ సంజయ్. కేసీఆర్ సీఎం కాకపోతే కేటీఆర్ ది బిచ్చపు బతుకు అయ్యేదని మండిపడ్డారు. కేటీఆర్ లా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: