స్మిమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. అంతేకాకుండా మున్నేరులో ఈత కొడుతున్నవారితో సరదాగా గడిపారు. కాంగ్రెస్ వస్తేనే ప్రజాస్వామ్య తెలంగాణ సాధ్యం అంటూ అక్కడున్న స్విమ్మర్స్ నినాదాలు చేశారు. ఖమ్మంలోని అసోసియేషన్ల ప్రతినిధులతో పాటు ప్రముఖులంతా తుమ్మలకు మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి అరాచకశక్తులను తరిమికొట్టాలని, అదే ధ్వేయంతో కాంగ్రెస్లోకి వచ్చానని చెప్పారు. రాహుల్గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేస్తే ఒక్క సూటుకేసుతో బయటికి వచ్చారని, అది చూసి చలించిపోయానని తుమ్మల అన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Election: ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నాం..తుమ్మల సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నామని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరు స్వార్థపరులు దోచుకుంటుంటే చూస్తూ ఉండలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.
Translate this News: