ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఏపీఎన్జీవో నాయకులు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కడుపు మండిన ఇద్దరు కానిస్టేబుల్ శ్రీశైలం ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగం పోతుందని తెలిసి కూడా జై తెలంగాణ నినాదాలు చేశారని ఈటల తెలిపారు. అప్పుడు నేను వారిని అభినందించి సత్కారం కూడా చేశానని ఈటల గుర్తు చేశారు. కానీ వచ్చిన తెలంగాణలో అనుకున్న ఫలితాలు అనుకున్న వర్గాలకు అందలేదని ఈటల ఫైర్ అయ్యారు. ఆత్మగౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Telangana News: తెలంగాణ బీజేపీలో భారీగా చేరికలు..ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి కాషాయ కండువాలు
తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది . నేడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట్లోని ఈటల రాజేందర్ నివాసంలో బీజేపీలో చేరారు శ్రీశైలం ముదిరాజ్. సిద్దిపేటకు చెందిన కానిస్టేబుల్ శ్రీశైలం ముదిరాజ్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు.
Translate this News: