ప్రముఖ నటి జయప్రదను 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 20 లక్షల రూపాయలను కూడా డిపాజిట్ చేయాలని తీర్పునిచ్చింది. ఉద్యోగులకు ఈఎస్ ఐ చెల్లింపులో అవకతవకల కేసులో జయప్రద మీద కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ నటి కోర్టును ఆశ్రయించారు.
పూర్తిగా చదవండి..ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు!
ఈఎస్ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్ కుమార్, రాజ్ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును చెప్పింది.
Translate this News: