అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను ఏషియన్ గేమ్స్లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఏపీ ప్రభుత్వం.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి తాము సాధించిన పతకాలను సీఎంకు క్రీడాకారులు చూపించారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..AP players: ఏషియన్ గేమ్స్ క్రీడాకారులను అభినందించిన జగన్… భారీ నజరానా ప్రకటన
అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు. ఏషియన్ గేమ్స్లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి.. సీఎం జగన్ను ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
Translate this News: