ఆ నియోజకవర్గం ఉమ్మడి విశాఖ జిల్లా(Vizag District)ల్లో టీడీపీకి కంచుకోట. ఆ మాజీ మంత్రి ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా 5 సార్లు విజయం సాధించారు.. అలాంటి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో జగన్ మ్యానియాకు, ఫ్యాను గాలికి సైకిల్ టైర్ పంచర్ అయ్యింది. అలాంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పుడు అధికార వైసీపీకి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.. ఎమ్మెల్యే పని తీరు బాగోకపోవడం.. సమన్వయ లోపంతో కేడర్ సతమతం అవుతున్నారు ఇంతకీ ఎక్కడా నియోజకవర్గం..? ఏమిటా కథ అనుకుంటున్నారా..? మీరూ ఓ లుక్కేయండి.!
పూర్తిగా చదవండి..AP Politics: వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరు..? టీడీపీ కంచుకోటలో ఫ్యాన్ గాలి వీస్తుందా?
నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న దూకుడుకు కళ్లెం వేసేందుకు వైసీపీ కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట అయిన నర్సీపట్నంలో గత ఎన్నికల్లో వైసీపీ గెలవడం నిజంగా పెను సంచలనం. అయితే గెలిచిన తర్వాత ఉమా శంకర్ గణేశ్ క్యాడర్ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాపను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Translate this News: