పసుపు బోర్డు(Turmeric board).. తెలంగాణ(Telangana) రైతుల కల.. ఎన్నో ఏళ్లుగా పసుపు బోర్డు కోసం నిజామాబాద్(Nizamabad) రైతులు పోరాడారు. 2019 జనరల్ ఎలక్షన్స్లో కేసీఆర్ కూతురు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత(Kavita) నిజామాబాద్లో ఓడిపోవడానికి పసుపు బోర్డు అంశమే కారణమంటారు విశ్లేషకులు. పసుపు బోర్డు తీసుకోస్తానని హామీ ఇచ్చిన ధర్మపూరి అరవింద్(Dharmapuri arvind) ఎంపీగా గెలుపొందారు. అప్పటినుంచి పసుపు బోర్డు ఎప్పుడు ప్రకటిస్తారా అని రైతులు ఎదురుచూశారు. రెండు వారాల క్రితం తెలంగాణకు వచ్చిన మోదీ పసుపు బోర్డు ప్రకటన చేశారు. దీంతో పసుపు రైతులు ఆనందపడ్డారు. తమ కల సాకరం అయిందని సంబరపడ్డారు. పసుపు రైతులకు ఇదొక మైలురాయి అని.. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్లో రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు బీజేపీ చేస్తున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని అరవింద్ ధర్మపురి మోదీని కొనియాడారు. అయితే రెండు వారాలు తిరిగే సరికి పసుపు బోర్డు విషయంలో రైతులు గొందరగోళానికి గురావల్సిన పరిస్థితులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తర్వాత పసుపు రైతులు అయోమయానికి గురవుతున్నారు.
పూర్తిగా చదవండి..Turmeric Board: పసుపు బోర్డు తెలంగాణలో కాదా? కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఏం ఉంది?
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు ఉంటుందని అక్టోబర్ 1న మహబూబ్నగర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పసుపు బోర్డుకు కేంద్రం ఆమోదం తర్వాత విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఎక్కడా కూడా తెలంగాణ పేరు లేదు. అసలు తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు
Translate this News: