కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor), టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా(Mahua Moitra) కలిసి ఉన్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. మహువా మోయిత్రా శశిథరూర్తో క్లోజ్గా ఉన్న ఫొటోలు అవి. అందులో ఇద్దరూ షాంపైన్ తాగుతున్నట్టు ఫొటోలుకు ఫోజులు ఇచ్చారు. మోయిత్రా అయితే సిగరేట్ తాగుతూ ఫొటోలో కనిపించింది. ఈ ఫొటోలను బీజేపీ ఫాలోవర్లు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. సిగరేట్ తాగుతూ ఫొటోలో కనిపిస్తున్న మోయిత్ర టార్గెట్గా సోషల్మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మోయిత్రా, శశిథరూర్ మధ్య ఏదో ఉందని ట్వీట్లు పెడుతున్నారు.
పూర్తిగా చదవండి..Shashi Tharoor: మహిళా ఎంపీతో శశిథరూర్.. ఫొటోలు వైరల్..! అసలేం జరిగిందంటే?
బీజేపీ మద్దతుదారులపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత శశిథరూర్తో కలిసి ఆమె షాంపైన్, సిగరేట్ తాగుతున్నట్టు ఫొటోలకు ఫోజులు ఇస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి. శశిథరూర్కు మోయిత్రా మధ్య ఏదో ఉందంటు పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే అది కేవలం ఫొటోలకు ఇచ్చిన ఫోజులు మాత్రమేనని.. తనకు సిగరేట్ అలర్జి ఉందని మోయిత్రా ట్వీట్ చేశారు.
Translate this News: