(తొలివెలుగు, హైదరాబాద్): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యింది. మెుత్తం 55 మందితో ఏఐసీసీ అధిష్టానం ఆదివారం ఈ జాబితా విడుదల చేసింది. వివాదాలకు తావు లేని స్థానాలనే తొలుత ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లో గజ్వేల్కు అభ్యర్దిని ఖరారు చేసిన కాంగ్రెస్, కామారెడ్డి టికెట్ను మాత్రం సస్పెన్స్లో పెట్టింది. అదే సమయంలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుండగా, రేవంత్ టీంకు సీట్లు దక్కాయని పలువురు భావిస్తున్నారు. ఇక పార్టీ ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. భట్టి విక్కమార్క మధిర నుంచి, సీతక్క ములుగు నుంచి పోటీ చేయనున్నారు. సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు ఈ సారి నాగార్జున సాగర్ నుంచి పోటీలో నిలుస్తున్నారు. జానారెడ్డి పోటీ నుంచి విరమించుకున్నట్లు స్పష్టం అవుతోంది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ కన్ఫార్మ్ ఆయింది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణికి కూడా టికెట్ దక్కింది. ఉత్తమ్ హుజుర్నగర్, పద్మావతి కోదాడ నుంచి బరిలోకి దిగుతున్నారు. భద్రాచలం టికెట్ కమ్యూనిస్టులకు కేటాయిస్తారని ప్రచారం జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్ ఖరారు చేసింది. జగిత్యాల నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక వామపక్షాలతో పొత్తులో భాగంగా చెన్నూరు, కొత్తగూడెం సీట్లు సీపీఐకి ఖరారు చేశారు.
పూర్తిగా చదవండి..Telangana Congress: కాంగ్రెస్ తొలి జాబితా బిడుదల.. లిస్ట్లో ప్రత్యేకతలు.. ఇతర నేతల రియాక్షన్స్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యింది. మెుత్తం 55 మందితో ఏఐసీసీ అధిష్టానం ఆదివారం ఈ జాబితా విడుదల చేసింది. వివాదాలకు తావు లేని స్థానాలనే తొలుత ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లో గజ్వేల్కు అభ్యర్దిని ఖరారు చేసిన కాంగ్రెస్, కామారెడ్డి టికెట్ను మాత్రం సస్పెన్స్లో పెట్టింది. అదే సమయంలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుండగా, రేవంత్ టీంకు సీట్లు దక్కాయని పలువురు భావిస్తున్నారు.
Translate this News: