జనసేన (Janasena) పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ(TDP) తో పొత్తు పెట్టుకోవడంతో పార్టీని వీడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. రెండు రోజుల క్రితమే పిఠాపురం మాజీ ఇన్ఛార్జీ మాకినీడి శేషు కుమారి రాజీనామా చేసిన వెంటనే ఆ పార్టీకి మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. తాజాగా ఆ పార్టీకి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి (Ketamreddy vinod kumar reddy) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..kethamreddy: జనసేనకు మరో భారీ షాక్..ఆ నేత గుడ్ బై చెప్పేశాడు!
నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి (Ketamreddy vinod kumar reddy) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రేపు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుఫున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి..ఓటమి పాలయ్యారు
Translate this News: