ఏపీలో నకిలీ పత్రాల తయారీదారుల దందా రోజు రోజుకు పెరిగి పోగుతున్నారు. ఇళ్ళు ఇప్పిస్తానని పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ పేద ప్రజలకు కేటాయించిన.. అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇప్పిస్తామంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో రియల్ఎస్టేట్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల పేరుతో నకిలీ పత్రాలు కలకలం రేపాయి. నకిలీ పత్రాల పేరుతో, టిడ్కోఇళ్ళు ఇస్తామని ఎంపీ కేశినేని నాని అనుచరుడు హబీబ్ మోసం చేశాడు. పేదవారికి మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్మించిన కబేల జిన్నూర్మ్ (JNNURM) కాలనీలో ఫ్లాట్ ఇప్పిస్తానంటూ మోసాలు చేశాడు. ఒక్కొక్క ప్లాటు మూడు లక్షల 50 వేల రూపాయలకే అమ్మకలు చేశాడు. దాదాపు 300 మంది వద్ద నుంచి 4 కోట్లు వరకు కేటుగాళ్ళు వసూలు చేశారు.
పూర్తిగా చదవండి..Fake documents: ఏపీలో నకిలీ పత్రాలు కలకలం.. కార్పొరేషన్ అధికారుల పేరుతో ఏం చేశారంటే..?
తెలుగు రాష్ట్రాల్లో మోసం చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. పేద ప్రజలనే టార్గెట్ చేసి లక్షల రూపాయలను దున్నుకుంటున్నారు. అధికారుల పేరు చెప్పి.. మాయమాటలతో అమాయకులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధితుల విజ్ఞప్తి చేస్తున్నారు. మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేద ప్రజలు ఆశకు పోయి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Translate this News: