తిరుమలలో ఇటీవల సెలవులు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సమాచారం ప్రకారం రెండు రోజుల నుంచి రద్దీ భారీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులు ఐదు నుంచి ఆరు గంటల్లోనే శ్రీవారి సర్వ దర్శనం అవుతోంది. కంపార్ట్మెంట్లలో భక్తుల రద్దీ కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. పెరటాసి మాసం.. మూడో శనివారం అయినప్పటికీ భక్తుల రద్దీ తగ్గటం గమనార్హం. ఇదిలాంటే.. మరోవైపు 2023 అక్టోబర్ 9న (సోమవారం) రేపు తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం జరగనున్నది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో పలు కీలక అంశాలతో పాటు… నవరాత్రి బ్రహ్మోత్సవాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈనెల14వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
పూర్తిగా చదవండి..Tirumala: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేకతలు ఇవే..!!
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను టీటీడీ వెల్లడించింది. ఈనెల 15 నుంచి 23 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభం నుంచి ముగింపు రోజు వరకు అష్టాదళ పాదపద్మారాధన,ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, తిరుప్పావడ, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
Translate this News: